
తాజాగా పూజ హెగ్డే మాదిరి ఇంకో హీరోయిన్ టాలీవుడ్ లో తయారైంది. ఆమె ఎవరో కాదు భాగశ్రీ బొర్సే. గతంలో ఇలానే శ్రీలీల వరసగా యంగ్ హీరోల సినిమాలు ఒప్పుకుని రెండుమూడు షిఫ్ట్ ల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఇప్పుడు ఆ అదృష్టం భాగశ్రీ బొర్సే కి దక్కింది. ప్రస్తుతము తెలుగులో వరస ఆఫర్స్ తో అమ్మడు ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
రీసెంట్ గానే భాగశ్రీ బొర్సే కి అఖిల్ లెనిన్ అఫర్ దక్కింది. శ్రీలీల తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి భాగశ్రీ బొర్సే వచ్చింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో కింగ్ డమ్ షూటింగ్ ఫినిష్ చెయ్యగా ఇప్పుడు ఆమె రామ్ తో ఆంధ్ర తాలూకా కింగ్, కాంత లాంటి చిత్ర షూటింగ్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు లెనిన్ అఫర్ రావడంతో భాగశ్రీ బొర్సే ఉదయం ఓ షూటింగ్, సాయంత్రం మరో షూటింగ్ అన్నట్టుగా పరుగులు పెడుతుందట.
భాగశ్రీ బొర్సే ఆ సెట్ నుంచి ఈ సెట్ కి, ఈ సెట్ నుంచి ఆ సెట్ కి వెళుతూ బిజీగా గడపడం చూసినవారు అప్పట్లో పూజ హెగ్డే ఇలానే చేసింది, ఇప్పుడు ఆ లక్కు భాగశ్రీ బొర్సే కి దొరికింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.