
క్రికెటర్లు తిరస్కరించాలి
ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ పేరు మార్చడంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ పేర్లను సిరీస్ కు పెట్టాలనే ఈసీబీ రిక్వెస్ట్ ను భారత క్రికెటర్లు తిరస్కరించాలని ఆయన కోరారు. ‘‘ఇంగ్లండ్, భారత్ రెండు దేశాల క్రికెట్ కు పటౌడీలు అందించిన సహకారం పట్ల గౌరవం లేకపోవడానికి ఇది నిదర్శనం. ఒక కొత్త ట్రోఫీకి ఇటీవలి ఆటగాళ్ల పేరు పెట్టవచ్చు. అయితే ఒక భారతీయ ఆటగాడిని సంప్రదిస్తే, అతను మర్యాదగా తిరస్కరించే మంచి జ్ఞానం కలిగి ఉంటాడని ఇక్కడ ఆశిస్తున్నాం. ఇద్దరు భారత మాజీ కెప్టెన్ల పట్ల గౌరవంతో మాత్రమే కాదు, అతను పోయిన తర్వాత అతని పేరు మీద ఒక ట్రోఫీని కలిగి ఉండాలనే ఆలోచనతో ఉండాలి’’ అని కాలమ్ లో గవాస్కర్ పేర్కొన్నాడు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.