
ByGanesh
Sat 07th Jun 2025 06:03 PM
కొన్ని నెలల క్రితం పఠాన్, టైగర్ 3 విడుదల సమయంలో దీనిని ఖాన్ ల త్రయం ప్రకటించింది కూడా. కానీ ఎందుకనో ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ రాలేదు. అయితే తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. సల్మాన్, షారూఖ్ లతో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని, కానీ కథ ఇంకా దొరకలేదని అన్నారు.
అలాగే దర్శకుడిని కూడా ఇంకా కనుగొనలేకపోయామని తెలిపాడు. దీనిని బట్టి ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ కెళ్లేందుకు ఛాన్స్ లేదు. ప్రస్తుతం ఈ ముగ్గురూ వరుస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయ్యేందుకు ఇంకో రెండేళ్లు పడుతుంది. అంటే 2028 వరకూ భారతదేశంలోని బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు!
Biggest multi-starrer in India:
Biggest multi-starrer in Indian cinema
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.