
ByGanesh
Tue 01st Jul 2025 08:09 PM
ఈనెల 3న ప్రతిష్ఠాత్మకంగా రామాయణం మొదటి మీడియా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే రామాయణం లోగో టైటిల్ లాంచ్ కార్యక్రమం జరుగుతుంది. అయితే అత్యంత కీలకమైన ఈ సమావేశానికి శ్రీరాముడి పాత్రధారి అయిన రణబీర్ కపూర్, రావణాసురుడి పాత్రధారి అయిన యష్ హాజరు కావడం లేదని తెలిసింది. దీనికి కారణం ఆ ఇద్దరూ విదేశాలలో ఉండటమే. యష్ తన కుటుంబంతో ఇప్పటికే అమెరికాకు వెళ్లారు.
టాక్సిక్, రామాయణం ఎడతెరిపి లేని షెడ్యూళ్లతో అలసిపోయిన యష్ కొన్ని వారాల పాటు అక్కడ విశ్రాంతి తీసుకుంటాడని తెలిసింది. అలాగే రణబీర్ ఇప్పటికే తన కుటుంబంతో లండన్ లో ఉన్నాడు. అంటే ఆ ఇద్దరూ ఇక కీలక ఈవెంట్లో కనిపించరు. వేడుకను నితీస్ తివారీ, ఇతర కాస్ట్ అండ్ క్రూతో కలిసి నిర్వహించనున్నాడు. సాయిపల్లవి, లారా దత్తా, సన్నీడియోల్, దూబే వంటి ప్రముఖులు అటెండవుతారని తెలుస్తోంది.
Ranbir-Yash skip Ramayana event:
Ranbir Kapoor and Yash to skip Ramayana title glimpse release
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.