
గ్రాట్యుటీ రూ 4 లక్షల నుండి రూ 8 లక్షలకు పెంపుపై అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధూపదీప నైవేద్య అర్చకుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. విద్య, వైద్యం, వివాహ గ్రాంట్, ఉపనయన గ్రాంట్, దహన ఖర్చులు, గ్రాట్యుటీ, అంగవైకల్యానికి ఆర్థిక సహాయం వంటి పథకాలను అర్చక సంక్షేమ నిధి ద్వారా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.
https://forgavedisciplinetolerance.com/v6tvb5f15d?key=0cea7d5c050fea452cf1b88013eeeb4b