
టూరిస్ట్ ఫ్యామిలీ మినీ స్టోరీ :
శ్రీలంక లో పరిస్థితులు బాగోక సముద్రం ద్వారా అక్రమంగా తమిళనాడులోకి ప్రవేశించి శరణార్థులుగా ఓ కాలనిలో అద్దెకు దిగిన ధర్మదాస్, అతని భార్య ఇద్దరు కొడుకులు ఆ కాలనీ వాళ్లతో ఎలా కలిసోయారో, బాంబ్ బ్లాస్ట్ విషయంలో పోలీసులు ఆ ఫ్యామిలీ కోసం ఎందుకు వెతికింది అనేది సింపుల్ గా టూరిస్ట్ ఫ్యామిలీ స్టోరీ.
శ్రీలంక నుంచి వచ్చేసిన ఓ ఫ్యామిలీ తమిళనాడులో శరణార్థులుగా ఎలా తల దాచుకుంది, ఈ క్రమంలో ఆ కాలనీ వాళ్లతో ఎలా కలిసిపోయింది అనే దాన్ని దర్శకుడు చక్కగా కాదు కాదు స్వీట్ గా చూపించాడు. ఆ కాలనిలో ఒకరితో ఒకరు కలవకుండా, ఎవరిని ఎవరూ పట్టించుకోకుండా, ఒకరితో కలిసి మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టుగా ఉండే కుటుంబాల నడుమ దిగిన ధర్మదాస్ ఫ్యామిలీ.. 15 రోజుల్లోనే ఆ కాలనీ వారిని మార్చిన తీరు కి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. లైఫ్ అంటే సింగిల్ బ్రతుకు కాదు, గొప్పగా బ్రతకడము కాదు.. నలుగురితో కలిసి సరదాగా బ్రతకడం అంటూ టూరిస్ట్ ఫ్యామిలీని దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రసంశనీయం.
ధర్మదాస్ గా శశికుమార్, వాసంతి గా సిమ్రాన్, వారి కొడుకులుగా నీతూ షాన్ మిథున్, మురళి కమలేశ్ మాత్రమే కాదు, ఆ కాలనిలో కనిపించిన ఆర్టిస్ట్ లు అందరూ తమ తమ పాత్రలకు జీవం పోశారు. అరవింద్ విశ్వనాథన్ ఫొటోగ్రఫీ, సీన్ రోల్డన్ సంగీతం, భరత్ విక్రమన్ ఎడిటింగ్ అన్ని టూరిస్ట్ ఫ్యామిలీకి కావాల్సినంత సపోర్ట్ చేశాయి.
టూరిస్ట్ ఫ్యామిలీ చిన్న కథే కానీ.. అందరిని ఆలోచింప చేసేకథ. అందుకే ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవుతున్నారు.. మరి మీరు మిస్ కాకుండా ఓసారి చూసెయ్యండి ఈ టూరిస్ట్ ఫ్యామిలీని.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.