
ByGanesh
Tue 01st Jul 2025 09:44 PM
టీడీపీ ఆఫీస్ పై దాడి, ఆ తర్వాత నకిలీ ఇళ్లపట్టాల కేసు ఇలా వంశీ కి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్ అంటూ వంశి జైలుకే పరిమితమయ్యారు. జైలులో ఉన్నప్పుడే వల్లభనేని వంశీకి ఆరోగ్యం పాడవగా ఆయనకు విజయవాడ ఆయుష్ లో చికిత్స అందించమని పోలీసులకు కోర్టు ఆర్డర్ వేసింది.
తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండుసార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులు విధించింది. వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకూ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్తో ఇంతవరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరు అయ్యింది.
Finally, relief for Vallabhaneni Vamsi:
Vallabhaneni Vamsi Finally Gets Bail in All Cases
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.